నల్గొండ జిల్లాలో నార్వే బృందం పర్యటన

నల్గొండ: జిల్లాలోని వ్యవసాయ, భూగర్భ జలాల వినియోగం పరిశీలన నిమిత్తం చౌటుప్పల్‌ మండలం లక్కారం గ్రామంలో నార్వే బృందం ఈరోజు పర్యటిస్తోంది. నార్వే దేశ ఆహార, వ్యవసాయశాఖమంత్రి ట్రిగ్వే హోల్డ్‌, పొలిటికల్‌ అడ్వజైర్‌ మిన్‌ హనే, హెడ్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ హుట్టార్‌ తదితరులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. వీరు గ్రామంలోని చెరువులు, వ్యవసాయ భూములను  పరిశీలిస్తారు. అనంతరం ఈ బృందం స్థానిక  రైతులతో సమావేశమై ఇక్కడి వ్యవసాయ విధానం, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ పద్ధతులపై చర్చించనుంది.