నల్లదనంపై మాకు స్పష్టత ఉంది: మోడీ

బెంగళూరు: నల్లదనంపై తమ ప్రభుత్వానికి స్పష్టత ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. బెంగళూరులో నిర్వహించిన బిజెపి మేథోమధన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో పయనిస్తోందని తెలిపారు. విదేశాల సహకారంతో నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.