నల్లబెల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

నల్లబెల్లి సెప్టెంబర్ 11 (జనం సాక్షి):
నల్లబెల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవ ఎన్నుకున్నట్లు ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు జంగిలి రాజు (మన తెలంగాణ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన అధ్యక్షుడిగా ఎండి చాంద్ పాషా (ఆంధ్రప్రభ), ప్రధాన కార్యదర్శిగా మిట్ట గడుపుల సాంబయ్య (సాక్షి), ఉపాధ్యక్షుడిగా చిర్ర రమేష్ (జనం సాక్షి), కోశాధికారిగా గంగిశెట్టి నాగభూషణ్ (వార్త) ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం తమవంతుగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.