నల్లమల అడవిలో పురిటి నొప్పులతో ఆయాస పడుతున్న ఆదివాసి మహిళకు సురక్షితంగా కాన్పు చేసిన 108 సిబ్బంది

అచ్చంపేట ఆర్సి, 23 జులై (జనం సాక్షి న్యూస్): నియోజకవర్గం పరిధిలోని అమ్రాబాద్ మండలం నల్లమల టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో పురిటి నొప్పులతో ఆయాస పడుతున్న ఆదివాసి మహిళకు 108 సిబ్బంది సురక్షితంగా కాన్పు చేశారు. వివరాల్లోకి వెళితే కొమ్మనపెంట చెందిన జిల్లా మణెమ్మ పురిటినొప్పులతో తీవ్రంగా ఆయస పడుతుండగా దగ్గరలోని స్థానికులు కొందరు 108 సమాచారం ఇవ్వగా సాయంత్రం సమయంలో 108 ద్విచక్ర వాహనం, అంబులెన్స్ సిబ్బంది అడవి మార్గంలో కొద్ది దూరం వెళ్ళగా వర్షానికి వాహనం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో 108 ద్విచక్ర వాహనాన్ని తోసుకుంటూ పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళ దగ్గరికి 108 అంబులెన్స్ సిబ్బంది సుజాత మల్లేష్ లు చేరుకుని సురక్షితంగా ప్రసవం చేయగ పండంటి పాపకు జన్మనిచింది.అనంతరం తల్లి బిడ్డలను ప్రయివేటు వాహనం లో మధ్యలో ఆగి ఉన్న 108 అంబులెన్స్ లో మార్చి అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.పైలెట్ వెంకటేష్ సహాయ సహకారాలు అందిచారు.