నల్లమల లో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ రైతు రచ్చ బండ కార్యక్రమం.

అచ్చంపేట ఆర్సీ,26 జులై, (జనం సాక్షి న్యూస్) : జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నల్లమలలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రైతు రచ్చబండ కార్యక్రమం లో భాగంగా మంగళవారం నాడు అమ్రాబాద్ మండలంలోని సార్లపల్లి, వటవర్లపల్లి, కుడిచింతలబైలు గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను వెల్లడిస్తూ మాకు నేటికి పొడుభూములకు పట్టాలు ఇవ్వలేదని,సార్లపల్లి, కుడి చింతల బైలు కు రోడ్డు సౌకర్యం లేదని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ స్పందిస్తూ ..రాహుల్ గాంధీ హాజరైన వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రైతులకు అండగా ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాల గురించి వివరించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు అన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసులు, సింగల్ విండో చైర్మన్ పోచం గణేష్ ఎంపిటిసి మల్లికార్జున్, రాజగోపాల్ ,కుంద మల్లికార్జున్ ,వటర్లపల్లి సర్పంచి చత్రు నాయక్, మాజీ సర్పంచ్ బౌరమ్మ,యూత్ కాంగ్రెస్ నాయకులు లింగేశ్వర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.