నల్లొండ జిల్లాలో విస్తృత తనిఖీలు

సూర్యాపేట: నల్లొండ జిల్లాలో పోలీసులు విస్తృతంగా  తనిఖీలు చేపట్టారు. ఐకాస పిలుపుమేరకు ఈ నెల 30న నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌కు వచ్చే  మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. బీబీనగర్‌ మండలం కొండమడుగు గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేస్తూ అనుమానస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు.