నవరాత్రి ఉత్సవాల ఆటపాటల పోటీలో పాల్గొనండి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్24(జనంసాక్షి):

ఈనెల 26 సోమవారం నుండి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆవోపా, వాసవీ క్లబ్,వాసవీ వనితా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాల లో ప్రతి రోజు వివిధ రకాల పోటీలు నిర్వ హిస్తామని వాసవీ క్లబ్ అధ్యక్షులు కండె సాయిశంకర్, కార్యదర్శి రమణ కుమార్, కోశాధికారి కంచెర్ల శ్యాం సుందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రతి రోజు ఉదయం11 గంటల నుండి ఆర్యవైశ్య విద్యార్థులందరికి భక్తి , హాస్య , వినోద భరిత ఆటలు, పాటలు, ప్రహేళిక లాంటి పోటీలు నిర్వహించ బడుతాయని అన్నారు.ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయబడుతాయని తెలిపారు.కావునా ఆసక్తి గల ఆర్యవైశ్య విద్యార్థులందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.పూర్తి వివరాలకు 9494844779,9948006765,9490673330 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.