నాంపల్లి అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

 నాంపల్లి భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశాలు జారీ చేశారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.