నాణ్యత తో పనులు పూర్తి చేయాలి

   అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం
అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్15)        అలంపూర్ మున్సిపాలిటీపట్టణం లో చేపట్టిన ప్రసాద్ స్కీమ్ పనులను నాణ్యతతో పూర్తి చెయ్యాలని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు.గురువారం పట్టణం లో జరుగుతున్న ప్రసాద్ స్కీం పనులను ఆయన పరిశీలించారు ఎమ్మెల్యే, సైట్ ఇంజనీర్ ను అడిగి పనులుజరుగుతున్న తీరు పై అర తీశారు.  ఇప్పటి దాకా 40% పనులు పూర్తి అయినవి అని వచ్చే సంవత్సరం నాటికి పనులు మొత్తం పూర్తి అవుతాయి అని ఎమ్మెల్యే కు తెలిపారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ పనులలో ఎలాంటి నాణ్యత లోపాలు లేకుండా, పూర్తి  నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల చైర్మన్లు వైస్ చైర్మన్లు మరియు వివిధ వార్డుల కౌన్సిలర్లు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.