నామినేషన్ దాఖలు చేసిన దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

నామినేషన్ దాఖలు చేసిన దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

జనంసాక్షి మంథని, నవంబర్ 4 : తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శనివారం మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో దుద్దిల్ల శ్రీధర్ బాబు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
అంతకన్నా ముందు మంథని మండలంలోని కన్నాల గ్రామం లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో, మంథని పట్టణములో శ్రీ మహాలక్ష్మి ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీధర్ బాబు సాదా సీదాగా వెళ్లి మంథని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు