నాయి బ్రాహ్మణులకు అన్యాయం చేస్తే సహించేది లేదు

నాయి బ్రాహ్మణుల మండల అధ్యక్షులు సైదులు
పెన్ పహాడ్. నవంబర్ 11(జనం సాక్షి) : నాయి బ్రాహ్మణ కులవృత్తులకు అన్యాయం చేస్తే సహించేది లేదని అసంఘం మండల అధ్యక్షుడు సన్నాయిల సైదులు అన్నారుశుక్రవారం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ప్లే కార్డు ద్వారా నిరసన తెలిపి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులను కార్పొరేట్ సంస్థ వాళ్ళు ప్రైవేటీకరణం చేయడానికి కుట్రలు చేస్తున్నారని అట్టి విధానాన్ని ఖండిస్తున్నామని వారన్నారు మా నాయి బ్రాహ్మణులకు అన్యాయం జరుగితే మేము ఎక్కడి వరకైనా పోతామని బ్రాహ్మణుల కుల వృత్తికి అన్యాయం చేయవద్దని, మా కుల వృత్తి మేము చేసుకునే జీవనం సాగిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో. గ్రామ అధ్యక్షులు పేరూరి పురుషోత్తం, పేరాల నాగేందర్ పేరూరు వెంకటేష్ సన్నాయిల వీరయ్య సన్నాయిల సైదులు సన్నాయిల నాగరాజు వల్ల రాజు, పి.రమణ, సతీష్, పి.రాజు, నగేష్, తదితరులు పాల్గొన్నారు.