నిట్‌ పనులను వేగంగా పూర్తి చేయాలి

కేంద్రానికి మాణిక్యాల రావు వినతి
న్యూఢిల్లీ,మే29(జ‌నం సాక్షి):  ఏపీలో నిర్మించతలపెట్టిన నిట్‌ పనులను వేగవంతం చేయాలని మాజీ మంత్రి మాణిక్యాల రావు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు విజ్ఞప్తి చేశారు. గూడెంలో ఏర్పాటు చేసిన నిట్‌ పనులు పూర్తి చేస్తే మంచిదని అన్నారు.  మంగళవారం ఢిల్లీకి వెళ్లిన బీజేపీ నేత మాణిక్యాల రావు.. వెంకయ్య నాయుడు, ప్రకాశ్‌ జవదేకర్‌ను కలిశారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, రాంమాధవ్‌, మురళీధర్‌ రావును కలుస్తానని, ఏపీపై ఎక్కువ దృష్టి పెట్టాలని కోరతామని చెప్పారు. టీడీపీ మహానాడులో మోదీ, అమిత్‌ షాలను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. నాలుగేళ్లుగా బిజెపి రాష్ట్రానికి చేసిన సేవలు, నిధుల కేటాయింపును మరచి మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రం అండదండలతోనే అనేక సంస్ళు వచ్చాయన్నారు.