నిత్యజీవితంలో యోగ భాగం అవ్వాలి

వరంగల్ ఈస్ట్, జూన్ 21(జనం సాక్షి):
 ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో యోగ అనేది ఒక భాగం కావాలని నగరంలోని కరీమాబాద్ లో గల కివి పబ్లిక్ స్కూల్ హెచ్ ఎం దాసి సతీష్ మూర్తి అన్నారు. ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం కివి పబ్లిక్ స్కూల్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు వివిధ యోగాసనాల తో విన్యాసాలు చేసి యోగ వల్ల కలిగే లాభాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా సతీష్ మూర్తి మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు ఏకాగ్రతకు ఆరోగ్యానికి యోగ ఆసనాలు ఎంతో దోహదపడతాయి అన్నారు. తమ పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజు ప్రత్యేకమైన యోగా తరగతులు నిర్వహిస్తున్నట్లు సతీష్ మూర్తి వివరించారు .ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అన్న దేవర ప్రవీణ్ కుమార్ యోగా మాస్టర్ రవితేజ విద్యార్థులు పాల్గొన్నారు అదేవిధంగా ఆంగ్లంలో యోగ అక్షరాలతో కూడిన విన్యాసాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.