నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం తీరు

హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో నిబంధనలను పాతర వేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు. సభా వ్యవహారాల మండలిలో  ఏ పార్టీలో ఎవరుండాలనేది ప్రభుత్వం నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని ఆయన విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. శాసనసభ తీరు నిబంధనలకు పాతర వేసే విధంగా ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని మాట్లాడనీయకుండా చేసి.. ఆ ఆరోపణలు మార్చి చివరకు దళితుడ్ని అవమానించారంటున్నారని అన్నారు. అఖిలపక్షంలో వీటిపై చర్చించి తమ సభ్యుడు నడుచుకుంటాడని.. రేవంత్ అసభ్యంగా మాట్లాడితే రికార్డ్ నుంచి తొలగించాలని లేదా స్పీకర్ కు రూలింగ్ ఇవ్వాలన్నారు. ఒక సభ్యుడ్ని మాట్లాడనివ్వకుండా, టీడీపీని గొంతునొక్కడమేనని సండ్ర తెలిపారు.

తాజావార్తలు