నిమ్మరాజు కు తెలుగు భాషా సేవా పురస్కారం

విజయవాడ, ఆగష్టు 30 (జనంసాక్షి :
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షులు పి.విజయబాబు నేతృత్వంలో వారం రోజులు గా జరుగుతున్న తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి 160 వ జయంతి వేడుకలు మంగళవారం రాత్రి విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా ముగిసాయి. సీనియర్ జర్నలిస్ట్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు ను కలెక్టర్ ఢిల్లీరావు ‘తెలుగు భాషా సేవా పురస్కారం’ తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు, రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పి.గౌతమ్ రెడ్డి, నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ చైర్మన్ మేఢపాటి వెంకట్, సి ఆర్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, శాసనమండలి వైకాపా పక్ష నేత, మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వివిధ కార్పొరేషన్ ల చైర్మన్ లు పాల్గొన్నారు.