నిరంతర శ్రామికుడు నిరంజనుడు

వ్యవసాయనికి పెద్ద పీట వేసిన మంత్రి

మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి

వనపర్తి బ్యూరో అక్టోబర్ 31 (జనంసాక్షి)

జిల్లా అభివృద్ధి కోసం అనుక్షణం ఆలోచిస్తూ నిరంతరం కష్టపడే నిరంతర శ్రామికుడు నిరంజనుడు అని మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి అన్నారు.పెద్ద మందడి మోజర్ల , మదిగట్ల గ్రామాలలో స్థానిక నాయకులతో కలిసి ఆమె ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి ని ఆయా గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయనికి సాగునీరు లేక ఉన్న గ్రామాలను విడిచి పెట్టి పొట్ట కూటి కోసం మహనగరాలకు వలసలు వెళ్లిన పరిస్థితి ఆనాటిది ఉద్యమ సమయంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రతి గ్రామాలకు వెళ్లిన సందర్భంలో ఆ పరిస్థితులను చూసిన తెలంగాణ రాష్ట్రం వస్తేనే బతుకుల్లో మార్పు వస్తుందని కన్నీరు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. స్వరాష్ట్రం ఏపార్టు అయిన తరువాత వనపర్తి నియోజకవర్గ పరిధిలో ప్రతి ఎకరాకు సాగునీరును అందించడంతో వలసలు తగ్గాయని , కుటుంబ సభ్యులతో కలిసి రైతులు వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉన్నారని ఆమె వివరించారు . మీ నీళ్ల నిరంజన్ రెడ్డి గారికి మరొకసారి ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు , నాయకులు పాల్గొన్నారు.