నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చిట్కుల్ గ్రామ సర్పంచ్ యన్ గోపాల్ రెడ్డి కే రామచంద్ర రెడ్డి అన్నారు హాస్పటల్లో అయిన ఖర్చు నిమిత్తం ఎల్లమ్మ గూడెం రాజు గౌడ్ కు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ 25000/- చెక్కును ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు .ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యన్ గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ పేదల సంక్షేమం కొరకు కెసిఆర్ గారు, స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కె, రామచంద్ర రెడ్డి గారు, చిలిపి చెడు ఎంపీపీ గారు, చంద్ర గౌడ్ గారు, సీనియర్ నాయకులు రాజిరెడ్డి గారు, మాణిక్య రెడ్డి గారు, లక్ష్మణ్ గారు ఇతర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు