నిర్మాణాత్మక ఆలోచనలకు ధ్యానం దోహదం చేస్తుందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు

మిర్యాలగూడ, జనం సాక్షి
స్థానిక ఏఆర్సీ గార్డెన్స్ లో హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడిటేషన్ క్యాంపులో ఆయన పాల్గొన్నారు. ఆత్మ జ్ఞానానికి ధ్యానం ఏకైక మార్గమని భాస్కర్ రావు అభిప్రాయపడ్డారు. ధ్యానం ద్వారా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంపొందించుకోవచ్చు అని అన్నారు. అనంతరం రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ పటేల్ నిర్వహించిన సామూహిక ధ్యానంలో భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేశ్, పారిశ్రామికవేత్త రంగా శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.