*నీలంపల్లిలో పౌరహక్కుల దినోత్సవం*

*చట్టాలకు లోబడి ఉండాలి:ఎస్సై అరుణ్*
*పలిమెల, ఆగస్ట్ 30 (జనంసాక్షి)* మండలంలోని నీలంపల్లి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సమావేషంలో ఎస్సై అరుణ్  గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రజలందరు చట్టాలు తెలుసుకోవాలని, చట్టాలకు లోబడి ఉండాలని అన్నారు. ప్రజలందరు కలిసి మెలిసి ఉండాలని అన్నారు. వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే శాంతంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అరుణ్ తో పాటు గ్రామ సర్పంచి రేగ నరేష్ మరియు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.