నులిపురుగు నివారణ మాత్రాలు పిల్లలందరూ వేసుకోవాలి

 

-ఎంపీపీ జి. స్నేహ

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 15
నులుపురుగుల నివారణకు మాత్రాలు సంవత్సరం నుండి 19సంవత్సరాల లోబడిన పిల్లలందరూ వేసుకోవాలని ఎంపీపీ జి. స్నేహ అన్నారు. గురువారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని షేక్ పల్లి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు నులుపురుగు మాత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
పిల్లలు ఆరోగ్యవంతులైతే చదువుతోపాటు అన్ని రంగాలలో రాణిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.