*నూతన ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు*

మెట్పల్లి టౌన్, సెప్టెంబర్ 07 :
(జనం సాక్షి)
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. ఈ కార్యక్రమం మెట్పల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ దేశంలోనే ప్ర ప్రథమంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర మేనని వ్యాఖ్యానించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, ఆసర పెన్షన్స్, బీడీ పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్, వితంతు పెన్షన్స్ మొదలగు సంక్షేమ పథకాలను అందిస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు, టిఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు ప్రజాప్రతినిధులు ,అధికారులు, నూతన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు