నూతన ఆసరా పెన్షన్ ల పంపిణీ

మోత్కూరు సెప్టెంబర్ 14 జనంసాక్షి : మోత్కూరు మండలం లోని పొడిచేడు, రాగిబావి, పనకబండ,ముషిపట్ల గ్రామాలలో బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయాలలో లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్ లను ఆయా గ్రామాల సర్పంచ్ లు పేలపూడి మధు, రాంపాక నాగయ్య, బత్తిని తిరుమలేశు, ఎంపీటీసీ బుషిపాక లక్ష్మి లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని, నూతనంగా ప్రవేశ పెట్టిన ఆసరా పెన్షన్ లను 57 సం.నిండి అర్హులైన లబ్ధిదారులకు అందరికీ ఆసరా పెన్షన్ లు అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, డైరెక్టర్ జిట్ట లక్ష్మయ్య, బిపిఒ ఎర్ర బిక్షం,పొన్నెబోయిన మచ్చగిరి, బత్తిని సుదర్శన్, లోతుకుంట బుచ్చి రాములు, పొన్నెబోయిన సత్తయ్య, మల్లయ్య,బతిని చిన్న తిరుమలేష్, ఉప సర్పంచ్ యెన్నం యాదిరెడ్డి, వార్డు సభ్యులు పసునూరి సోమిరెడ్డి రాంపాక ఎల్లమ్మ,గ్రామ పంచాయతీ కార్యదర్శి లు చిన్నం కిరణ్, సింగారపు స్వాతి తదితరులు పాల్గొన్నారు.