నూతన పింఛన్ల పంపిణీ

మునగాల, సెప్టెంబర్ 14(జనంసాక్షి): మండలంలోని నర్సింహాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 57సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు, వితంతు, వికలాంగుల, ఆసరా పింఛన్లను గ్రామసర్పంచ్ కారంగుల నాగమణి చేతుల మీదుగా బుధవారం పంపిణీ చేశారు. ఒకొక్కరికి రెండు వేల పదహారు రూపాయల చొప్పున కొత్తగా మంజూరైన 50 మందికి నగదు రూపంగా పంపిణీ చేశారు. వయస్సు మళ్ళిన దశలో పింఛను మంజూరు కావటం ఎంతో సంతోషకరమని లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ అల్లి పద్మ రామయ్య, పోస్టుమాస్టర్ వెంకటరెడ్డి, పంచాయతీ కార్యదర్శి పచ్ఛిపాల వెంకటేశ్వర్లు, వార్డుమెంబర్లు వీరబాయిన శ్రీను, కే సోవమ్మ, పి.కృష్ణ, సీహెచ్ శ్రీలత, ప్రభాకర్ మరియు గ్రామ పెద్దలు, బొమ్మ చినవెంకన్న, వేమూరి సత్యనారాయణ, కారంగుల వెంకట సైదులు, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.