నెడు దోమకొండ కోట నుండి మహమ్మద్ అలీ షబ్బీర్ పాదయాత్ర…

కామారెడ్డి ప్రతినిధి ఆగస్ట్8(జనంసాక్షి);
నెటి నుండి 5 రోజుల పాటు కాంగ్రెస్ “ఆజాదీ కి గౌరవ్ పాదయాత్ర”
దేశవ్యాప్తంగా,రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆగస్టు 9నెటి నుండి 14 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “ఆజాదీ కి గౌరవ్ పాదయాత్రలు” నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు 75 కిలోమీటర్ల “ఆజాదీ కి గౌరవ్ పాదయాత్ర” లు ఆగస్టు 14 వ తేదీతో ముగిసిన తర్వాత, ఆగస్టు 15 న పెద్ద ఎత్తున అన్ని  జిల్లాలోనికాంగ్రెస్పార్టీ ప్రధాన కార్యాలయాల్లో75వస్వాతంత్రోత్సవాలు నిర్వహించనున్నారు.ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు “ఆజాదికిగౌరవ్” పాదయాత్రల” కార్యక్రమానికి రూప కల్పన చేసిన సి.డబ్ల్యు.సి… 75 వ స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని ప్రతి జిల్లాలోనూ మొత్తం 75 కిలోమీటర్ల మేరకు “ఆజాదికి గౌరవ్ పాదయాత్రలు” నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.ప్రతి జిల్లాలో నిర్వహించే “ఆజాదికిగౌరవ్ పాదయాత్రల్లో” భాగంగా, ఆయా జిల్లాల్లో ఉన్న స్వాతంత్ర సమరయోధులను, వారి కుటుంబాలను కలిసి గౌరవించాలని, వారి త్యాగనిరతిని గుర్తుచేసుకోవాలని, స్వాతంత్ర్యోద్యమంతో సంబంధం ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలను, కట్టడాలను సందర్శించి జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున “గౌరవ పాదయాత్రలు” నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత పిఏసి కన్వీనర్ మహమ్మద్ అలీ షబ్బీర్  దోమకొండ మండలంలోని దోమకొండ కోట నుండి పాదయాత్రను ప్రారంభిస్తారు.