నేడు గొల్లప్రోలులో సిఎం జగన్‌ పర్యటన

కాపునేస్తం అబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దాడిశెట్టి

కాకినాడ,జూలై28(జనంసాక్షి ): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారంకాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ కాపునేస్తం పథకం మూడో విడత సహాయం బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకోనున్నారు. 10.45`12.15 గంటల వరకు బహిరంగ సభా ప్రాంగణంలో ప్రసంగించి.. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం సహాయం విడుదల చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటకు అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. 1.30 గంటలకు తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కాపు మహిళలకు సీఎం జగన్‌ సాయం అందించనున్నారు. పథకంలో భాగంగా ముఖ్యమంత్రి స్వయంగా మూడో విడత పంపిణీ చేయనున్నారు. పిఠాపురం నియోజక వర్గంలో గొల్లప్రోలు నగర పంచాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కాపు నేస్తం లబ్దిదారులకు సాయాన్ని విడుదల చేయనున్నారు. కాపు సామజిక వర్గంలోని ఉపకులాలకు చెందిన కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాల కు చెందిన మహిళలు లబ్దిదారులు. 45 ఏళ్ళు నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని అందిస్తోంది. నేరుగా మహిళల ఖాతాలో ప్రభుత్వం జమచేస్తుంది. నగదు జమ అయిన వెంటనే ఒక మెసేజ్‌ కూడా వస్తుంది. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ద్వారా సుమారు 3.2 మంది మహిళలు లబ్దిపొందనున్నారు. ఏటా సుమారు రూ.490 కోట్లను వెచ్చిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలో భాగంగా వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ద్వారా వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ. 75వేలను ఆర్ధిక సాయం అందించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకంలో లబ్దిదారుల మహిళలు నెలసరి ఆదాయంలో గ్రావిూణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతంలో రూ.12 వేల లోపు ఉండాలి. ఇక స్థిరాస్తుల విషయంలో కూడా పరిమితులు ఉన్నాయి. కుటుంబంలోని ఎవరైనా ప్రభుత్వపు వృద్దాప్యపు, వికలాంగ పెన్షన్‌ పొందుతున్నవారు కూడా కాపునేస్తం పథకానికి అర్హులు
ఇదిలావుంటే గొల్లప్రోలులో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. సీఎం జిల్లా పర్యటనకు సంబంధించి కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులతో మంత్రి రాజా ఇప్పటికే సవిూక్షించారు. కొత్తగా కాకినాడ జిల్లా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నారని, పర్యటనను విజయవంతం చేయాలన్నారు.