నేడు ‘నీట్‌’ పరీక్ష

ఐదు నగరాల్లో ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్‌, మే 4 (జనంసాక్షి) :
మెడికల్‌ కోర్సుల్లో జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ఆదివారం రాష్ట్రంలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో జరుగనుంది. ఈ పరీక్ష సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్‌, నెల్లూరుతో  పాటు మరో మూడు చోట్ల పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నీట్‌ అర్హత పరీక్ష తప్పనిసరి అని సుప్రీం కోర్టు తేల్చడంతో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు నీట్‌, ఎంసెట్‌ పరీక్షలు రాస్తున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు పరీక్షలు ఉండటంతో విద్యార్థులపై మానసికంగా భారం పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు