నేడు నెహ్రు వర్థంతి.. మోదీ, రాహుల్ నివాళి

న్యూఢిల్లీ: భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు 54వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘన నివాళులర్పించారు. ప్రధాని ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. ఢిల్లీలోని నెహ్రు సమాధి శాంతివన్ వద్ద రాహుల్ గాంధీ పుష్పాంజలి సమర్పించి అంజలి ఘటించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ శాంతివన్‌ను సందర్శించి నివాళులర్పించారు.