నేడు బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు విద్యార్థుల ఎంపిక

జనంసాక్షి బ్యూరో, వనపర్తి :
 షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో  బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో 1వ. తరగతి, 5వ. తరగతులలో ప్రవేశం పొందుటకు లక్కీ డిప్ ద్వారా సీట్లను ఎంపిక చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ముఖ్య అతిథిగా హాజరవుతారని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిని నుషిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 8వ తేదీన ఉదయం గం. 11.00 లకు ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో లక్కీ డిప్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆమె సూచించారు.