నేడు మానుకోటలో బీజేపీ నవయువ భేరి ర్యాలి

 

-గాంధీపార్కులో బహిరంగ సభ

మహబూబాబాద్‌, నవంబర్‌ 11(జనంసాక్షి):

మానుకోట జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో బీజేపీ నవయువ భేరి ర్యాలీ, అనంతరం బహిరంగ సభ ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు యాప సీతయ్య తెలిపారు. సోమవారం ఈ మేరకు స్థానిక గాంధీపార్కులో సభ ఏర్పాట్లను నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందని, ముందస్తు ఎన్నికలతో ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ కుట్రలను తిప్పి కొట్టేందుకు బీజేపీ ధీటైన నాయకులను రంగంలోకి దించిందని తెలిపారు. ప్రజలు నిరంకుశ ప్రభుత్వం తీరుతో విసిగిపోయారని…బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.. నేడు జిల్లాలోని గూడూరు మండలం భూపతిపేట నుండి బీజేపీ నవయువ భేరి వాహన ర్యాలీ మొదలై పట్టణంలోని గాంధీపార్కుకు చేరుకుంటుందని, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నామన్నారు. ఈ సభలో మానుకోట అసెంబ్లీ అభ్యర్థి జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ పరిచయంతో ఎన్నికల ప్రచారం మొదలవుతుందన్నారు. బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలి, బీజేపీ పార్టీని ఆదరించి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సభకు ముఖ్య అతిధులుగా ఏపి ఎమ్మెల్సీ సోమ వీరన్న ముఖ్య అతిధిగా హాజరుకానున్నారన్నారు. సభాస్థలిని పరిశీలించిన వారిలో బీజేపీ నాయకులు కాలేరు నేతాజి, కిరణ్‌, మేరెడ్డి సురేందర్‌, మోసంగి మురళి, కొత్త రంగారెడ్డి, వాసం వెంకటేశ్వర్లఉ, సిరికొండ సంపత్‌, మహేష్‌, తదితరులు ఉన్నారు.