నేతాజీ కుటుంబం పై నిఘా పెట్టడాన్ని నిరసిస్తూ ర్యాలీ

నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులపై నిఘా పెట్టడాన్ని నిరసిస్తూ ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు ర్యాలీ నిర్వహించారు. కోల్ కతాలో నిర్వహించిన ఈ ర్యాలీలో నేతాజీ మనువలు పాల్గొన్నారు. తమ కుటుంబంపై నిఘాకు సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాలని నేతాజీ ఫ్యామిలీ మెంబర్స్ డిమాండ్ చేశారు. మరోవైపు ఇదే అంశంపై నేతాజీ ముని మనువడు సూర్య ప్రధాని మోడీని బెర్లిన్ లో కలిశారు.