నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు

నేపాల్‌:మాసన సరోవర్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 30 మంది యాత్రికులు చిక్కుకుపోయారు.నేపాల్‌ ముక్తినాథ్‌ వంతెన తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.దీంతో యాత్రికులు వంతెన అవతలి వైపే ఉన్నారు.అక్కడ సహయక చర్యలకు వాతావరణం అనుకూలంగా లేదని అధికారులు అన్నట్లు తెలుస్తోంది.యాత్రికులను రక్షించి బేస్‌ పాయింట్‌కు చేరుస్తామని అధికారులు భరోసా ఇచ్చారు.