నేరాల నిర్మూలనకు శాంతి భద్రతల పరిరక్షణకే కమ్యునిటి కాంటాక్ట్ ప్రోగ్రాం DCRB. DSP వెంకటేశ్వరరావు

నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో DSP వెంకటేశ్వర్ రావు ఆదేశాల మేరకు స్థానిక LB కాలనీలో (సీసీపీ) కాంటాక్ట్ -కమ్యూనిటీ- ప్రోగ్రాం నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు. ఈ సందర్భంగా DSP వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ కాలనీలో ఎవరైనా కొత్తవారు సంచరించినా, ఇళ్లకు అద్దెకి ఇవ్వాలన్నా, సరైన పత్రాలు అడగాలని, ఏమైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలు తమ వెంట ఉంచుకోవాలని, భద్రతాపరమైన అవగాహనలో భాగంగా ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ CI సీతయ్య, మరికల్ సీఐ రామ్ లాల్,7 ఎస్సైలు, ముగ్గురు ఏ ఎస్సైలు,మక్తల్ సర్కిల్ మరియు మరికల్ సర్కిల్ పోలీసులు దాదాపు 80 మంది సిబ్బంది పాల్గొన్నారు.