న్యాయవ్యవస్థ దైవత్వంతో కూడుకున్నది:ప్రధాని

న్యూఢిల్లీ : న్యాయవ్యవస్థ చేస్తున్న పని దైవత్వంతో కూడుకున్నదని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ – సుపరిపాలన అంశంపై జరిగిన సదస్సులో మోడీ ప్రసంగించారు. సమాజంలో న్యాయవ్యవస్థపై బృహత్తర బాధ్యత ఉందన్నారు. న్యాయవ్యవస్థ నుంచి సామాన్యులు ఎంతో ఆశిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం ఉత్తమ న్యాయవ్యవస్థను తయారు చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని సూచించారు.