*పంటంత నిటా మునిగింది …. ఆదుకోండి సార్*

*దేవరుప్పుల,జులై 23 (జనం సాక్షి) :* మండలంలోని నిన్న కురిసిన వర్షానికి చెరువులు ,కుంటలు అతలాకుతలం అయ్యాయి. నిన్న ఒక్క రోజే మండలంలో 204 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణం శాఖ వెల్లడించింది. మండలంలోని ధర్మపురం గ్రామంలోని ముండి చింత తండా లో నిన్న ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఎత్తు ప్రదేశం నుంచి వచ్చిన వరద ధాటికి భూక్య భీమా అనే రైతు పంట పొలాలు నిటా మునిగాయని ఉన్న కొద్దిపాటి పొలాల్లో 50,000 రూపాయలు అప్పు తెచ్చి దున్నించి,నాటు వేశామని వరద తాకిడికి నాటంత కొట్టుకుపోయిందని రైతు లబోదిబోమంటున్నారు. దయచేసి మాకు ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాకు సహాయం చెయ్యాలని రైతు వేడుకున్నాడు.
Attachments area