పంటల సాగుపై ఈ`క్రాప్‌ బుకింగ్‌

అనంతపురం,జూలై13(జనంసాక్షి): రాష్ట్రంలో ఈ`క్రాప్‌ బుకింగ్‌లో ముందున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు సాగు చేసిన పంటలను ఈ`క్రాప్‌ బుకింగ్‌ కార్యక్రమం కూడా మరో వైపు వెలుగు, వ్యవసాయశాఖ సంయుక్తంగా చేయనున్నట్లు తెలిపారు. రైతులకు మార్కెట్లో నాణ్యమైన ఎరువులు పురుగుమందులు అందించేందుకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ప్రతి డివిజన్‌కు ఇంటర్నల్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేసి తనిఖీ చేయనున్నట్లు చెప్పారు. పెట్టుబడి రాయితీ పంపిణీలో ఎటువంటి సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నా నేరుగా వ్యవసాయశాఖకు తెలియజేసేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు పంటసాగులో పెట్టుబడి ఖర్చులు తగ్గించాలన్న ఉద్దేశ్యంతో రాయితీ పనిముట్ల అందజేయ నున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సబ్సిడీ వేరుశనగ పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. వేరశనగతో పాటు అంతర్‌ పంటల విత్తనం కింద కందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. లోపం ఉన్న రైతుల పొలాలకు భూసారం పరీక్ష కార్డులు ఆధారంగా ఉచితంగా రైతులకు సూక్ష్మపోషక ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.