పట్టణ ప్రగతితో పెబ్బేరును ఆదర్శ పట్టణం చేసుకుందాం:చైర్మన్ కరుణ శ్రీ

పెబ్బేరు జనం సాక్షి న్యూస్: పట్టణ ప్రగతి,  విడత హరితహారంలో భాగంగా పట్టణ కేంద్రంలోని  స్మశానవాటికకు వెళ్లే దారిలో మరియు శ్మశానవాటికలో JCB ల సహాయంతో కంప చెట్లను, చెత్తలను  తొలగించే పనులను మున్సిపల్ చైర్మన్ ఎద్దుల కరుణశ్రీ సాయినాథ్ పరిశీలించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమం లో పట్టణంలో ఉన్న కంప చెట్లను, పారిశుద్ధ్య పనులను పూర్తి చేసుకుని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుకుంద మని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్-చైర్మన్ కర్రెస్వామి , కౌన్సిలర్ గోపిబాబు, మున్సిపల్ కమిషనర్ జాన్ కృపాకర్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమ మహేశ్వర్  పాల్గొన్నారు.