పరీక్షా కేంద్రాలు పరిశీలించిన ఎస్సై శేఖర్

మల్దకల్ ఆగస్టు 26 (జనంసాక్షి) ఈనెల 28 ఆదివారం ఉదయం పదిగంటల నుండి ఒంటిగంట వరకు జరిగే కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించిన పరీక్షా కేంద్రాలను ఎస్సై శేఖర్ పరిశీలించారు.మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ జూనియర్ కళాశాల, ట్రినిటీ హై స్కూల్ లను శుక్రవారం పరిశీలించారు. పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు తప్ప మిగతావారు 100 మీటర్ల దూరంలో ఉండాలని తెలిపారు.జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ ఇమ్మానియేల్ తదితరులు ఉన్నారు.