పలు గుర్తులను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం

న్యూఢల్లీి,సెప్టెంబర్‌25  (జనంసాక్షి); కేంద్ర ఎన్నికల సంఘం పలు గుర్తులను సవరిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఎన్నికల సంఘం జాతీయ, రాష్ట్ర పార్టీలకు శాశ్వత గుర్తులు కేటాయించింది. ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీల కోసం కేటాయించే ఫ్రీ సింబల్స్‌ విషయంలో కొన్ని ఆంక్షలను విధించింది. వివిధ రాష్టాల్ల్రో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్టాల్ల్రో పలు గుర్తులను ఉపయోగించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటూ తాజా ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగా ఆటోరిక్షా, టోపీ, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్ల్రో వినియోగించుకోకుండా ఆంక్షలు విధించింది. ఈ గుర్తులను ఏపీ, తెలంగాణ మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. కాగా, గతంలో జనసేనకు కేటాయించిన గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్‌ కేటగిరీలో ఉంచింది.