*పల్లె ప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి,* *ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య,..*


వాజేడు జూన్10 జనం సాక్షి:
వాజేడు మండలంలో ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పర్యటించారు,పర్యటన లో భాగంగా పల్లె ప్రగతి ఐదో విడత కార్యక్రమం లో  మండలంలోని   మురుమూరు  గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి ఐదో విడత పల్లె ప్రగతి లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల వివరాలను పంచాయతీ కార్యదర్శి చిడెం నరేష్ కుమార్ అడిగి తెలుసుకున్నారు, పంచాయతీలో అదనపు అభివృద్ధి పనులను కొరకు జిల్లా కలెక్టర్ కోరగా సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అదనపు నిధులు అంగన్వాడీ బిల్డింగ్, సీసీ రోడ్లు కొరకు  నిధులు ఇస్తామని హామి ఇచ్చారు,అలాగే మొదటి విడత లో ఇచ్చినటువంటి నిధులతో స్కూల్స్ ,అంగన్వాడీలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించిచారు, ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో విజయ,ఎంపీపీ శ్యామల శారద,ఎంపీఓ శ్రీకాంత్, ఏ పీ ఓ అంకుష్, ఎస్ఐ హరీష్, స్థానిక సర్పంచ్ పూసం నరేష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ఛీడం నరేష్ బాబు, ఉప సర్పంచ్ గౌరరాపు కోటేశ్వరరావు, వార్డు నెంబర్ బోదె బోయిన మోహన్ రావు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు,