పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన నూతన కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సాయిలు.

పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన నూతన కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సాయిలు. 

కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-పోతంగల్ మండలం హంగర్గ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం రోజున నూతన కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సాయిలు పరిశీలించారు.పాఠశాలలో ఆయన మౌలిక వసతులను పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన స్థానిక పాఠశాల సిబ్బందితో కలిసి మధ్యాహ్న భోజనం పరిశీలించారు.భోజనం నాణ్యత,మెనూ అమలు చేస్తున్న తీరుపై స్థానిక ఉపాధ్యాయులను ఆరా తీసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన వెంట స్థానిక పాఠశాల హెడ్మాస్టర్ రమణ,పిఆర్టియు మండల అధ్యక్షులు వెంకటేష్, పాఠశాల ఉపాద్యాయ బృందం,సిబ్బంది ఉన్నారు