పాడేరులో టిపిఎఫ్‌ ధర్నా

అల్లూరి జిల్లా,జూలై26(జనంసాక్షి): పాడేరులో ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ధర్నాకు దిగింది. జీవో నెం.117 ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ను రద్దుచేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. 3, 4, 5 తరగతులను ఉన్నతపాఠశాలలో విలీనం చేసే పక్రియను నిలిపివేయాలని అన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయు పోస్టులను భర్తీ చేయాలని, మునిసిపల్‌, ఏడెడ్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు పి.ఎఫ్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ
ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పాల్గొన్నారు.