పాత నేరస్థులపై రౌడీ షీట్స్,సస్పెక్ట్ షీట్స్ ఎత్తివేత.

సత్ప్రవర్తన తో మెలగాలి.
జిల్లా ఎస్పీ పి.మనోహర్.
అచ్చంపేట ఆర్ సి,   జూలై (జనం సాక్షి న్యూస్) : స్థానిక నియోజకవర్గ పరిధిలోని 150 మంది రౌడీ షీట్స్ , సస్పెక్ట్ షీట్ లలో నేరాలకు పాల్పడిన వారి తో  పోలీసులు అధికారులు అచ్చంపేట పోలీసు కార్యాలయంలో బుధవారం నాడు సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన జిల్లా ఎస్పీ  మనోహర్ పాత నేరస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ…. పాత నేరాలలో ప్రమేయం ఉన్నవాళ్లు ఇక మీదట భవిష్యత్తులో సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారిపై ఉన్న రౌడీ షీట్స్ , సస్పెక్ట్ షీట్స్ ని పోలీస్ రికార్డులను తొలగించారు . కార్యక్రమంలో డిఎస్పి కృష్ణ కిషోర్, అచ్చంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అనుదీప్, అమ్రాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, సబ్ డివిజనల్ పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు.