పాదయాత్ర గా వెళ్లిన భక్త బృందం

రాజోలి జులై26 (జనం సాక్షి) ఉరుకుంద ఈరన్న స్వామి భక్తులపాలిట నిజంగా కొంగుబంగారమే! కోరిన వెంటనే భక్తుల కోర్కెలను తీర్చే దేవుడిగా ఈరన్న స్వామికి పేరు. ప్రస్తుతం శ్రావణ మాసం సమీపిస్తుండటంతో ఉరుకుంద స్వామిని దర్శించుకొనేవారి సంఖ్య అధికంగాఉండబోతోంది. స్వామి వారికి ఈ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుమారు నెల రోజులపాటు స్వామి వారికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. మంగళవారం నాడు జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండల కేంద్రం నుండి రెండు వందల భక్త బృందం స్వామి వారి సన్నిధికి కాలి నడక బయలుదేరి వెళ్లారు. వీరు మూడు రోజుల్లో ఉరుకుంద స్వామి క్షేత్రం చేరుకొని స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.