పార్లమెంట్ మార్చ్ చలో ఢిల్లీ జయప్రదం చేయండి.

– ఏఐవైఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను
 నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్: యువజన విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 25న పార్లమెంట్ మార్చ్ ఛలో డిల్లీ నిర్వహిస్తున్నామని యువకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో కదిలి రావాలని  ఏఐవైఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను కోరారు.ఈ కార్యక్రంలో నేరేడుచర్ల జూనియర్ కళాశాల ఆవరణలో ఛలో డిల్లీ గోడపత్రికలు విడుదల చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యార్థి,యువత పాత్ర ప్రధానమైందని.యువతరంలో ప్రగతిశీల,అభ్యుదయ భావాలను దేశభక్తి, లౌకిక ప్రజాస్వామ్య ఆలోచనలను, నైతికత విలువలను మానవత్వాన్ని పాదుకొల్పడానికి అఖిల భారత యుజన సమాఖ్య (ఏఐవైఎఫ్) అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నిరంతరం కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో యువజన, విద్యార్థి నాయకులు తమ్మిశెట్టి నరేష్,చారగుండ్ల జగదీష్, రేఖ నాగరాజు, జయంత్,నరసింహ,ఆకాష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.