పాలమూరు నీళ్ల పోరు దీక్షలో: జనగామ జిల్లా కోఆర్డినేటర్ చేవెళ్ల స్వామి

బచ్చన్నపేట సెప్టెంబర్ 15 జనం సాక్షి : మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు నీళ్ల కోసం పోరాడుదాం అన్నదాతలకు న్యాయం చేద్దాం. అనే నినాదం పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల 24 గంటల నిరాహార దీక్ష కార్యక్రమంలో జనగామ నియోజకవర్గ కోఆర్డినేటర్. చేవెళ్ల స్వామి పాల్గొన్నారు. అనంతరం షర్మిల అక్క చేపట్టే దీక్షకు జనగామ ప్రాంతం నుండి వైయస్సార్ టి పి నాయకులు మద్దతు పలుకుతూ తెలంగాణలో ఎక్కడ సమస్య ఉన్న అక్కడ షర్మిల అక్కతో పాల్గొంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపూరి సోమన్న కళాబృందంతోపాటు అధికార పార్టీ మీద ఆటపాటలతో విమర్శలతో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ దీక్షలో జనగామ నియోజకవర్గ కోఆర్డినేటర్. వెంకట్ రెడ్డి బచ్చన్నపేట మండల అధ్యక్షులు వగలబోయిన శ్రీకాంత్ గౌడ్. యూత్ అధ్యక్షులు శ్రీధర్ జనగామ నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.