పినపాక నియోజకవర్గం లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.

బూర్గంపహాడ్ సెప్టెంబర్ 04 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం లో సోమవారం అనగా ది: 05-09-2022 ఉదయం గం”09:00ని”ల నుండి మధ్యాహ్నం గం”03:00 ని”ల వరకు మణుగూరు, అశ్వాపురం, బూర్గంపహాడ్ మండలాలలో తెరాస రాష్ట్ర నాయకులు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పర్యటించనున్నారు. ఆయా మండలాల ప్రజాప్రతినిదులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్‌ తుళ్లూరి బ్రహ్మయ్య తెలియజేశారు.