పిల్లల శుభ్రతపై దృష్టి పెట్టండి

మల్దకల్ సెప్టెంబర్ 21(జనంసాక్షి)పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా మల్దకల్ మండల కేంద్రంలోని 2,3,6 అంగన్వాడీ కేంద్రాలలో బరువు తక్కువగా ఉన్న పిల్లల తల్లిదండ్రులు సమావేశం బుధవారం నిర్వహించారు. పిల్లల పోషణకై తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవ్వవలసిన పోషకఆహారం గురించి అవగాహన కల్పించారు.పిల్లల శుభ్రత పై దృష్టి పెట్టాలని, తల్లులతో హ్యాండ్ వాష్ చేయించడం జరిగింది. ఈకార్యక్రమంలో డిఎంహెచ్ఓ  చందునాయక్,డాక్టర్ సుప్రిత, సూపర్వైజర్ బాలమ్మ, అంగన్వాడీ టీచర్స్ లక్ష్మీ రంగమ్మ ,సునీత ఆయా నవీన, ఏఎన్ఎంలు,ఆశలు,తల్లి తండ్రులు కిషోరబాలికలు పాల్గొన్నారు.