పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలి

వరంగల్‌,జనవరి3(జ‌నంసాక్షి): ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని తపస్‌  నాయకులు  డిమాండు చేశారు. సీఎం ఇచ్చిన హావిూ మేరకు బకాయిలు సంక్రాంతి నాటికి జీపీఎఫ్‌ ఖాతాల్లో జమచేయాలని డిమాండు చేశారు. పాఠశాలలు, ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ తరువాత బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందన్నారు. సీపీఎస్‌ విధానం రాష్ట్ర పరిధిలోని ఉన్న అంశం కావడంతో
సీపీఎస్‌ రద్దు చేసి తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని పేర్కొన్నారు.