పుణెలో బస్సు డ్రైవరుకు కోర్టు మరణశిక్ష

పుణె: గత ఏడాది జనవరిలో 9 మంది మరణానికి , 37 మంది గాయపడడానికి కారణమైన బుస్సు డ్రైవరు సంతోష్‌
మానెకు స్థానిక సెషన్స్‌ కోర్టు మరణశిక్ష విధించింది. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన డ్రైవరు సంతోష్‌
మనె మానసిక పరిస్థితి సరిగా లేనందువల్ల ఈ ప్రమాదం జరిగిందన్న డిఫెన్స్‌ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.  అతను పూర్తి చేతనావస్థలోనే ఉన్నాడని భావించిన తాలూకు దుష్పరిణామాల గురించి అర్థం చేసుకునే స్థితిలోనే ఉన్నాడని భావించిన న్యాయస్థానం అతనిని హత్య , హత్యాయత్నం, ప్రజాసంపదకు నష్టం, దొంగతనం … లాంటి పలు నేరాలపై విచారించి శిక్ష ఖరారు చేసింది.