పుష్పగుచ్చాలతో విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు 

ధూల్మిట్ట (జనంసాక్షి) జూన్ 13 : బడులు పునః ప్రారంభంలో భాగంగా సోమవారం మండలంలోని బైరాన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు పుష్పగుచ్చాలతో, స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేసి స్వాగతం పలికారు. ఈసందర్భంగా పాఠశాల హెచ్ఎం మీనాంజనేయులు మాట్లాడుతూ..   విద్యార్థులు ప్రతీ రోజు పాఠశాలకు తప్పకుండా హాజరుకావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీనాంజనేయులు,ఉపాధ్యాయులు సిధ్దారెడ్డి, మహేష్, సతీష్ కుమార్,హైమ, రాజు, లక్ష్మీనారాయణ, ప్రశాంత్, రాజమణి,తదితరులు పాల్గొన్నారు.